నిద్రపోయేముందు ఈ రెండు లైన్ల శ్లోకం చదవండి. ఎలాంటి పీడకలలు మీ దరిచేరవు.


మన హిందూ ధర్మ శాస్త్రాలలో ప్రతీ పనిని శుభప్రదంగా ప్రారంభించటానికి, మొదలెట్టిన పనిని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తిచేయడానికి అనేక పద్ధతులు, మంత్రాలూ చెప్పబడ్డాయి. వాటిలో భాగంగానే ఉదయం లేవగానే ఏ మంత్రం చదవాలి, దేవుణ్ణి ఎలా స్మరించాలి. రోజు ఎలా ప్రారంభించాలి. భోజనం చేసేముందు భగవంతుణ్ణి ఎలా ధ్యానించాలి లాంటివి. కానీ అవి చాల మందికి తెలియక పఠించరు. కాబట్టి అందరికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ పోస్ట్ లో నిద్ర పోయేముందు ఏ శ్లోకం చదవాలి అనేది ఇవ్వటం జరుగుతుంది.

హిందూ ధర్మం ప్రకారం నిద్రపోయేముందు, నిద్రలేచిన తర్వాతకూడా దేవుని స్మరించాలి అని చెప్తారు. ఆలా స్మరించటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయట అన్నిటికంటే ముఖ్యమైనది మనకు ఈ జన్మ ఇచ్చిన దేవునికి కృతజ్ఞత తెలుపుతున్నట్టు దేవుణ్ణి నిరంతరం ప్రార్దిస్తాం. 

కింద ఇచ్చిన శ్లోకాన్ని మీరు నిద్రపోయేముందు చదివితే ఎలాంటి దుస్వప్నాలు రావు అని చాలామంది విశ్వాసం.  ఇదే ఆ శ్లోకం

రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ |
శయనే యః స్మరేన్నిత్యమ్ దుస్వప్న-స్తస్యనశ్యతి ||

కాబట్టి ప్రతీ హిందువు నేటినుండి ప్రతీ రోజు పడుకోబోయేముందు పైన తెలుపబడిన శ్లోకం చదివి నిద్రించండి. మరొక పోస్ట్ లో ఉదయం లేవగానే ఏ మంత్రం చదవాలో తెలుసుకుందాం. ఎలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే పైన భక్తి - శక్తీ అనే పేరు కింద కనబడుతున్న subscribe అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ email అడ్రస్ ఎంటర్ చేయండి. అంతే ఎలాంటి విలువైన సమాచారం మీ మెయిల్ కి నేరుగా వచ్చేస్తుంది ఉచితంగా. ప్రతీ హిందువు subscribe చేసుకుంటారని ఆశిస్తున్నాము. జై హింద్. 

శుభం భూయాత్ 

Comments